.:: పదిలోనూ ఇంటర్నల్స్- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు ::. |
![]() |
![]()
హైదరాబాద్:
పదో తరగతి పరీక్షల్లోనూ ఇంటర్నల్స్ అమల్లోకి రానున్నాయి. ఏడాది పాటు
విద్యార్థులు చేసిన అసైన్మెంట్స్, ప్రాజెక్టులు, ప్రయోగాలకు 20 శాతం
మార్కులు కేటాయించనున్నారు. ప్రతి సబ్జెక్టులో రాత పరీక్షకు 80 శాతం
మార్కులనే ఇవ్వనున్నారు. ప్రస్తుతం ద్వితీయ భాష మినహా మిగిలిన అన్ని
సబ్జెక్టులకు రెండు చొప్పున పరీక్ష పేపర్లు ఉన్నాయి. వాటిని కూడా రెండు
కాకుండా ఒకటిగానే చేసి ఆరు పేపర్లు అమల్లోకి తేవటంపై చర్చ జరుగుతోంది.
నాలుగు సహ-పాఠ్య కార్యక్రమాలకు 50 మార్కుల చొప్పున 200 మార్కులను
కేటాయించనున్నారు. ఈ మేరకు టెన్త్ మెమోల స్వరూపంలోనూ మార్పులు తేనున్నారు.
దీనికి అనుగుణంగా పదో తరగతి పాఠ్య పుస్తకాలను రాష్ట్ర విద్యా పరిశోధన,
శిక్షణ మండలి మార్చుతోంది. ఈ ప్రక్రియ ఈ నెలాఖరుతో పూర్తి కానుంది. వచ్చే
విద్యా సంవత్సరం (2014-15) నుంచి కొత్త పాఠ్య పుస్తకాలతోపాటు కొత్త పరీక్షల
విధానాన్ని అమల్లోకి తేనుంది.
ప్రధానంగా రానున్న మార్పులు...
|
Tuesday, December 24, 2013
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment