Wednesday, December 25, 2013







* జస్టిస్ పి. సదాశివం:
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
* గులాం ఇ. వాహనవతి:
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
* మోహన్ పరాశరన్:
సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
* జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్త: AP హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి



* సుప్రీం కమాండర్:
రాష్ట్రపతి, ప్రణబ్‌ముఖర్జీ
* చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్:
జనరల్ బిక్రమ్ సింగ్
* చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్:
అడ్మిరల్ దేవేంద్రకుమార్ జోషీ
* చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్:
ఎయిర్ చీఫ్ మార్షల్ ఎకె బ్రౌనే
జల సంరక్షణే శ్రీరామరక్ష
 

ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం సన్నగిల్లుతుందన్న, వర్షాతిరేకం వెల్లివిరుస్తుందన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలో చెరువులు, కుంటల సముద్ధరణ, సంరక్షణపై తక్షణం దృష్టి సారించాల్సి ఉంది. వూరూరా చెరువులు, కుంటల సంరక్షణ చర్యలు చేపడితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందనడంలో సందేహం లేదు. జూన్‌-సెప్టెంబర్‌ మధ్యకాలంలో దేశంలో 89సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుందని భారత వాతావరణ సంస్థ, అమెరికాలోని అంతర్జాతీయ వాతావరణ పరిశోధన సంస్థ, దక్షిణ కొరియా సంస్థ ఏపీఈసీ వాతావరణ కేంద్రం, 'స్కయిమెట్‌ వెదర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' సంస్థలన్నీ శుభం పలుకుతున్నాయి.

సమయం మించుతోంది...
కిందటి సంవత్సరం కొన్నిచోట్ల మినహాయిస్తే వివిధ ప్రాంతాల్లో చెరువులు, కుంటలను నింపగల వానలు కురవలేదు. నాగార్జునసాగర్‌ జలాశయం కనీసం నాలుగో వంతు కూడా నిండలేదు. వర్షాధారంగా సాగయ్యే 4.05కోట్ల ఎకరాల్లో సగం భూమి అరకొర వానల కారణంగా బీడుగానే మిగిలిపోయింది. రాష్ట్రంలోని 73,604 చెరువుల్లో- 44,417 వినియోగంలో ఉన్నాయి. ఈ చెరువులవల్ల 23.45లక్షల ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా పట్టుమని 10శాతం భూమీ తడవడంలేదు. 2011-12లో 2,157 చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రపంచ బ్యాంకు నిధులు కేటాయించగా- పనులు అరకొరగా, అస్తవ్యస్తంగా సాగాయి. నిరుడు వర్షాలు బాగా కురిసి వరదలొచ్చి ఉంటే కట్టలు తెగి ఆ పనుల బండారమూ బట్టబయలయ్యేది! నీటి వనరుల్లో పేరుకున్న పూడికను తొలగించటం, చెరువుల కట్టలను పటిష్ఠం చేయడం, కాల్వలను బాగుచేయడం వంటి పనులను చిత్తశుద్ధితో పూర్తిచేస్తేనే ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది. ఈ నెలలో చెదురుమదురు వర్షాలు కురవవచ్చునని అంచనాలు వెలువడుతున్నప్పటికీ, కానీ జిల్లాలకు ఇంకా నిధులు మంజూరు కాక చెరువుల బాగుసేత పనులే ఆరంభం కాలేదు. సమయం మించిపోతోంది. వర్షాలు కురిస్తే పనులు చేయడం దుర్లభం. మార్చి నుంచి యుద్ధప్రాతిపదికన కదిలితేనే తొలకరి నాటికి కొంతవరకైనా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగాన్ని తీవ్ర కుదుపులకు గురిచేసిన ఉపాధి హామీ పథకం కింద కొన్ని చెరువుల్లో పనులు సాగుతున్నా- అవి చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఎండల సాకుతో ఉదయం 8-10 గంటల మధ్య ఆ పనులు మందకొడిగా సాగుతున్నాయి. 'సవ్యంగా పనులు చేస్తే పూడిక మొత్తం పోయి చెరువులు పాతాళం లోతులో కనిపించేవి. అయిదేళ్ల నుంచీ కోట్ల రూపాయలు ఖర్చయినా ఫలితం శూన్యమని' కూలీలతో జరిగిన సమావేశంలో ఓ మంత్రి వ్యాఖ్యానించడం ఈ పథకం డొల్లతనాన్ని వెల్లడి చేస్తోంది. పూడిక తీసిన మట్టిని కట్టబయట పోయాల్సి ఉండగా లోపలి వాలుపై పరిచేయడంవల్ల వర్షాలు కురిసినపుడు చెరువులోకి తిరిగి పూడిక చేరుతోంది. ఏటా ఇదే తంతు సాగుతూ నిధులు నిష్ప్రయోజనమవుతున్నాయి. లోపాన్ని గుర్తించి సమస్యను పరిష్కరించకుండా వదిలేసిన పక్షంలో- ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా తయారవుతోంది పరిస్థితి.
మొక్కుబడి పనులు
కరీంనగర్‌ జిల్లాలో 70 పెద్ద చెరువుల కట్టలు తెగిపోయి నాలుగేళ్లుగా ఆయకట్ట నీరు అందడం లేదు. 210 చెరువుల్లో ఉపాధి పనులు సాగుతుండగా 450 చెరువుల బాగు సేతకు ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మెదక్‌ జిల్లాలోని 5,500 చెరువులు, కుంటల మరమ్మతుకు వేయి కోట్ల రూపాయలు అవసరం కాగా, కేవలం వంద కోట్ల రూపాయలే కేటాయించారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గొలుసుకట్టు చెరువులు అనేకం మరమ్మతులకు సిధ్ధంగా ఉన్నాయి. కొన్నింటిని బాగుచేసి మరి కొన్నిటిని వదిలేశారు. ఒక చెరువు వరద మరో చెరువు కట్టను తెగ్గొట్టే ప్రమాదం ఉంది. ఒక చెరువు నిండాక అందులోని నీరు తూము ద్వారా క్రమంగా మరో చెరువుకు చేరితేనే చేసిన పనులు నిలుస్తాయి. రంగారెడ్డి జిల్లాలో మూడు వేల పైచిలుకు చెరువు కుంటలు పూడి రూపం కోల్పోయి పొలాల మట్టానికి వచ్చాయి. నిరుడు కేవలం 40 చెరువులకు మాత్రమే మొక్కుబడిగా మరమ్మతులు చేయగలిగారు. నల్గొండ జిల్లాలో భారీ నీటి వనరులన్నింటికీ మరమ్మతులు అవసరం కాగా- కేవలం 136 చెరువులనే బాగు చేశారు. కర్నూలు జిల్లాలో 1,134 చెరువులుండగా రూ.10కోట్లు వెచ్చించి నిరుడు వేసవిలో 40చెరువులకు మాత్రమే అరకొర మరమ్మతులు చేశారు. కడప జిల్లాలో 1,845 చెరువులుండగా 63చోట్ల మాత్రమే మరమ్మతులు చేశారు. ఈ జిల్లాలో 303 పెద్ద చెరువుల కట్టలు బలహీనంగా ఉన్నాయి. తూములు దెబ్బతిని, వాటి తలుపులు మొరాయిస్తున్నాయి. నిరుటి వేసవిలో అనంతపురం జిల్లాలో 142, చిత్తూరు జిల్లాలో 165 చెరువుల మరమ్మతులు కొంతమేరకు చేయగలిగారు. వాటి నాణ్యత ఏపాటిదో వరదలొస్తేగానీ స్పష్టం కాదు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా అన్ని కోస్తా జిల్లాల్లోనూ చెరువుల కథ ఇదే విధంగా ఉంది.
ఏదీ నాటి సంకల్పం?
కాకతీయ రాజులు, నిజం నవాబులు, కృష్ణదేవరాయలు వంటి పాలకుల కాలంలో ఇప్పటిలా 121కోట్ల జనాభా లేదు. చిత్తశుద్ధి గల పాలకుల ఆదేశాలమేరకు ఆనాడు- తక్కువ శ్రమశక్తితోనే చెరువులు, కుంటలు తవ్వుకోగలిగారు. అప్పట్లోనే రాజులు లోతైన చెరువులు తవ్వి భావితరాలకు గొప్ప మేలు చేశారు. కానీ నేడు ఇంత జనాభా, ఆధునిక యంత్రాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉండి కూడా ఆ చెరువుల్లో కనీసం పూడిక తీసుకోలేని దురవస్థలో ప్రభుత్వాలున్నాయి. అయిదారువందల ఏళ్ల కిందట గానుగ సున్నంతో నిర్మించిన తూములు ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉండగా- నేడు అత్యాధునిక పరిజ్ఞానంతో, సాధనాలతో, సిమెంట్‌ కాంక్రీటులతో నిర్మించే నిర్మాణాలు మూణ్నాళ్ల ముచ్చటగా మిగులుతున్నాయి. లోపం ఎక్కడ జరుగుతోందో పసిగట్టి పరిహరించాల్సిన పాలకగణం కేవలం పదవులను నిలబెట్టుకునేందుకే ప్రాధాన్యమిచ్చి మిన్నకుంటోంది. నీరు సమృద్ధిగా చేరే చెరువుల, తూముల నిర్వహణ సరిగాలేక, సగం నీరు వృథాగా వెళ్లిపోతోంది. తూముల తలుపులను మరమ్మతు చేసేందుకు నిధులు లేవంటూ నీటిపారుదల శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు.
అధ్వాన నిర్వహణ
పెద్దయెత్తున 3.3శతకోటి ఘనపుటడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన కంభం చెరువు నిర్వహణ అధ్వానంగా తయారైంది. రాష్ట్రంలో ఇదే పెద్ద చెరువు. ముప్ఫై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు- 22 గ్రామాలకు తాగునీటిని, 10వేల ఎకరాలకు సాగునీటిని అందించేది. గత ఏడాది ఈ చెరువు కనీసం సగమైనా నిండలేదు. వచ్చిన కొద్దిపాటి నీటిలో ప్రధానభాగం తూముల ద్వారా వృథాగా పోయింది. శతకోటి ఘనపుటడుగుల నీటితో ఎనిమిది వేల ఎకరాల మాగాణిని గాని, 12వేల ఎకరాల్లో ఆరుతడి పంటలను గాని పండించవచ్చు. బిందుసేద్యం ద్వారా అయితే 25వేల ఎకరాల్లో పండించవచ్చు. ఈ లెక్కన కంభం చెరువు నిండితే నిలిచే నీటితో కనీసం 24వేల ఎకరాల మాగాణినిగానీ, 36వేల ఎకరాల ఆరుతడి సాగుగానీ చేయవచ్చు. చెరువు నిండినా తూములు బాగుపడక నీరు వృథాగా పోవడంవల్ల 10వేల ఎకరాలకు మించి ఎన్నడూ సాగు కాలేదు. రూ.15కోట్లు ఖర్చుచేస్తే నీటి వృథాను అరికట్టవచ్చునని రైతులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం కనికరించడంలేదు.
రాష్ట్ర రాజధానికి అనుకుని ఉన్న ఇబ్రహీంపట్నం చెరువు అయిదేళ్లుగా నీటి నిల్వకు నోచుకోవడంలేదు. 1300 ఎకరాల విస్తీర్ణంలో అనేక కింది చెరువులకు ఆధారమైన ఈ జలాశయం వరద కాలువ ఆక్రమణకు గురై బోసిపోతోంది. వికారాబాద్‌ నుంచి షాబాద్‌, శంషాబాద్‌ మండలాల మీదుగా 86కిలోమీటర్ల మేర వరద కాలువ ఈ చెరువులోకే వస్తుంది. మధ్యలో పహాడీ షరీఫ్‌ ప్రాంతీయులు ఈ కాల్వను ఆక్రమించి ఇళ్లు కట్టేయడంతో నీళ్లు పక్కదారి పట్టి వృథాగా పోతున్నాయి. చెరువుకు నీళ్లు ప్రవహించే మార్గాన్ని సరిచేయాలని పర్యావరణ నిపుణులు, ప్రతిపక్షాలు, రైతులు నాలుగేళ్ల నుంచి ఎన్నోమార్లు విన్నవించుకున్నా సర్కారుకు కనువిప్పు కలగడంలేదు. ఈ చెరువుకు నీరొస్తే 100కు పైచిలుకు గ్రామాల్లో భూగర్భ జలమట్టం పెరుగుతుంది. దానికింద ఉండే ఇరవై చిన్న చెరువులకు నీరు చేరుతుంది. దానికిందగానీ, దీని ఉపచెరువుల కిందగానీ సుమారు 20వేల ఎకరాల భూమిలో రెండు పంటలు పండుతాయి.
నీటి సంరక్షణే శ్రీరామరక్ష
ఇందిరమ్మ చెరువులు, సామాజికాభివృద్ధి పథకాల ద్వారా చేపట్టే మట్టిపనుల్లో నిధుల స్వాహామెంతగా జరుగుతోంది. ఈ పనులను చేజిక్కించుకునేందుకు పెద్దయెత్తున పోటీ ఉంటోంది. కడప జిల్లాలో 427 చెరువుల పనులకోసం 46.03కోట్ల రూపాయలను మంజూరు చేసి టెండర్లు పిలవగా, వాటిని దక్కించుకొనేందుకు ఇటీవల ఆ జిల్లాలోని కేంద్ర చిన్ననీటి పారుదల ఇంజినీరు కార్యాలయంలో గుత్తేదారులు బాహాబాహీకి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి తగవు తీర్చాల్చి వచ్చింది. పూడిక తీత పనుల్లో జరుగుతున్న అవకతవకలను సరిదిద్దడంపై ప్రభుత్వం గట్టి శ్రద్ధ పెడితే తప్ప జలవనరుల సద్వినియోగం సాధ్యం కాదు. వానలు లేక నిరుడు మార్చి నాటికి రాయలసీమలో భూగర్భ జలమట్టం సగటున 12.71మీటర్లకు దిగజారిపోయింది. ఈ ఏడాది మార్చినాటికి ఆ మట్టం 17.08మీటర్ల లోతుకు కుంగిపోయింది. తెలంగాణలో భూగర్భ జలమట్టం గత ఏడాది తొమ్మిది మీటర్లకు దిగజారగా, ఈ ఏడాది అది 11.5మీటర్లకు పడిపోయింది. రుతు పవనాలు సానుకూలంగా ఉండబోతున్న తరుణంలో చెరువులు, కుంటలను బాగుపరచి పెద్దయెత్తున నీటిని నిల్వ చేసుకుని ప్రగతికి బాటలు వేయాలి. అప్పుడే భూగర్భ జలమట్టాలు పెరిగి అన్ని ప్రాంతాలకు నీటి లభ్యత సులువవుతుంది. నీటి అవసరాన్ని, ప్రాధాన్యాన్ని గుర్తించి పాలకులు తక్షణం జలసంరక్షణ చర్యలకు పూనుకోవాలి. ఆక్రమణలకు గురై మాయమైన చెరువులను సర్వే చేయించి పునరుద్ధరించడం ద్వారా నీటి నిల్వలను పెంచవచ్చు. చెరువుల్లో జరిగే ఉపాధి పనులు సమర్థంగా, శాస్త్రబద్ధంగా ఉండేలా చూడాలి. చెరువు కట్టలను పటిష్ఠంగా రూపొందించడంతోపాటు పూడికతీతకు, తూముల మరమ్మతుకు, కాల్వల పునరుద్ధరణకు- యంత్రాలను, ఆధునిక సాంకేతికతను వినియోగించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడితేనే ప్రయోజనం ఉంటుంది. అవినీతి, అక్రమాలను అరికట్టడం ద్వారా పనుల్లో నాణ్యత పెంచేందుకు కృషి చేయాలి. ప్రాజెక్టుల జలాశయాల్లోనూ, పెద్ద చెరువుల్లోనూ మట్టిని తవ్వి తీసుకెళ్లేందుకు రైతులకు అనుమతిని ఇస్తే పూడిక బెడద కొంతైనా తగ్గుతుంది. చెరువు భూముల ఆక్రమణ, కట్టలు తెగ్గొట్టే దుశ్చర్యలను అడ్డుకుని నీటిని కాపాడే బాధ్యతను సాగునీటి సంఘాలు, రైతులు స్వీకరించాలి. తోటలున్న రైతులు 14X14X4 మీటర్ల కొలతలతో వర్షాకాలం గుంత తవ్వించుకుంటే అందులో 10లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంటుంది. ఇందుకు రూ.2,20,232 ఖర్చు అవుతుంది. అందులో 90శాతం సొమ్మును ప్రభుత్వం ప్రోత్సాహక రాయితీ రూపంలో అందిస్తోంది. రైతు 10శాతం ఖర్చును మాత్రమే భరించి నీటిని సమృద్ధిగా పొందవచ్చు. 35X35X4 మీటర్ల గుంతను తవ్వించుకుంటే 50లక్షల లీటర్ల నీటిని సంరక్షించుకోవచ్చు. ఇందుకు రూ.5,91,428 ఖర్చవుతుండగా రైతు రూ.59,142 మాత్రమే భరించాలి. ఇదే విధంగా పొలాల్లో రైతులు సామూహికంగా చిన్న కుంటలు తవ్వుకుని జల సంరక్షణకు పూనుకుంటే పంటలు బాగా పండుతాయి. తొలకరి సమీపిస్తున్న తరుణంలో సర్కారు మీనమేషాలు లెక్కించకుండా జల సంరక్షణ పనులు వేగంగా సాగిస్తే రాష్ట్రంలో పంటల పరిస్థితి మెరుగుపడుతుంది.
ఐక్యూ అసలు కథ!
బ్రిటన్‌లో ఓ బాలిక.. మేధస్సులో ఐన్‌స్టీన్‌, బిల్‌ గేట్స్‌, స్టీఫెన్‌ హాకింగ్‌ వంటి ప్రముఖులను మించిపోయింది. వారి ఐక్యూ స్థాయి 160 అయితే ఈ బాలికది 162. అసలు ఈ ఐక్యూకీ మేధస్సుకి ఏంటి సంబంధం. ఐక్యూ ఎక్కువగా ఉంటే మేధావులేనా! అసలు దీన్ని ఎలా లెక్కిస్తారు! ఇంతకీ ఐన్‌స్టీన్‌ ఐక్యూను ఎలా లెక్కగట్టారు!
నా ఐక్యూ 145: ఐన్‌స్టీన్‌
మీరు చదువుతోంది నిజమే. ఐన్‌స్టీన్‌ స్వయంగా తన మేధోస్థాయిపై చేసిన వ్యాఖ్య ఇది. ఆయన బతికున్నపుడు ఒక చిన్నారి ఆయన ఐక్యూ స్థాయిని తెలుసుకోవాలని.. ఆయనకు ఒక లేఖ పంపిందట. దానికి స్పందించిన ఐన్‌స్టీన్‌ ఆ చిన్నారికి సమాధానం పంపుతూ తన ఐక్యూ 145 అని చెప్పారట.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు విద్యార్థులు, యువత ఐక్యూను పరీక్షించి.. దాన్ని ప్రముఖుల ఐక్యూతో పోల్చుతున్నాయి. ఐన్‌స్టీన్‌ వంటి ప్రముఖులకన్నా ఎక్కువగా ఐక్యూ ఉన్న విద్యార్థులు.. ఏటా పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నారు. దీంతో ఐక్యూ పరీక్షలపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం వ్యక్తులకు పలు పరీక్షలు నిర్వహించి వారి ఐక్యూను కొన్ని గంటల్లో తేల్చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు లేని.. చనిపోయిన ప్రముఖుల ఐక్యూలను ఎలా లెక్కగట్టారన్నది మరింత ఆసక్తికర అంశం. ఇప్పుడు లేని వారి ఐక్యూను లెక్కగట్టడానికి మాత్రం చాలా సమయం పడుతోంది. ఆయా ప్రముఖుల కాలం.. అప్పుడు వారు చేసిన చర్యలు, సాధించిన విజయాలు.. విజయాలు సాధించినపుడు వారి వయసు, రచనలు, చిత్రాలు, ప్రతిపాదించిన సిద్ధాంతాల ఆధారంగా మానసిక శాస్త్రవేత్తలు వారి ఐక్యూను లెక్కగట్టారు. లియో నార్డో డావిన్సీకి 220, న్యూటన్‌కి 190, డార్విన్‌కి 165, ఐన్‌స్టీన్‌కి 160 ఉన్నట్లు తేల్చారు. అయితే ఈ గణాంకాలు వూహాజనితమే తప్ప.. అవి పక్కాగా లేవన్నది మరికొందరి వాదన. అలాగే ప్రస్తుతం నిర్వహిస్తున్న ఐక్యూ పరీక్షలపై కూడా పలువురు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక్క పరీక్షతోనే ఒక్క వ్యక్తి ప్రజ్ఞను అంచనా వేయలేమని.. అందుకు కనీసం మూడు రకాల పరీక్షలు అవసరమని ది టెలిగ్రాఫ్‌, న్యూ సైంటిస్ట్‌ పత్రికలు ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
ఆ పరీక్ష ఇలా మొదలైంది..!
ఐక్యూ గణన 19వ శతాబ్దంలో మొదలైంది. శారీరక కారణాల వల్లే మానసిక విలక్షణత సాధ్యమవుతుందని భావించిన ప్రముఖ శాస్త్రవేత్త, మానసికనిపుణుడైన ఫ్రాన్సిస్‌ గాల్టన్‌ తన వాదనను నిరూపించేందుకు అధ్యయనం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 1890లో గాల్టన్‌ శిష్యుడైన అమెరికన్‌ జేమ్స్‌ మెక్‌ కీన్‌ కాటెల్‌ మేధస్సును కొలిచేందుకు ఒక పరీక్ష నిర్వహించాలన్న ఆలోచనను తెరపైకి తెచ్చారు.
అదే సమయంలో ఫ్రాన్స్‌లో అక్కడి ప్రభుత్వం చిన్నారుల్లో మేధస్సును కొలిచేందుకు ఒక విధానాన్ని సృష్టించాలని భావించి.. ఆ పనిని ఆల్‌ఫ్రెడ్‌ బినెట్‌ అనే మానసిక నిపుణుడికి అప్పగించింది. ఆయన తన వద్ద ఉన్న సమాచారం, నైపుణ్యం ఆధారంగా ఒక పరీక్ష విధానాన్ని రూపొందించారు. తర్వాత 1912లో జెర్మన్‌ సైకాలజిస్టు విల్‌హెల్మ్‌ స్టెర్న్‌ చిన్నారుల్లో మానసిక వయసు గుర్తించే ప్రతిపాదన తెచ్చారు. మానసిక వయసును, అసలు వయసుతో పోల్చి మేధస్సును లెక్కించే విధానాన్ని రూపొందించారు. దీన్ని 1916 నుంచి అమెరికా అమలు చేయడం ప్రారంభించింది. చివరకు ఈ పరీక్ష ఆధారంగా హత్యకేసులో శిక్షపడిన ఖైదీని సైతం అతని మానసిక స్థితి సరిగ్గాలేదని తేల్చి వదలిపెట్టింది.
మొదటి ప్రపంచ యుద్ధంలో..
1917లో మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనేందుకు అమెరికా సిద్ధమైనపుడు సైన్యంలోని పలు ఉద్యోగాలకు అవసరానికన్నా ఎక్కువ మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. వారిలో సమర్థవంతులను ఎంపిక చేసేందుకు అమెరికా.. ఐక్యూ అనేపదాన్ని సృష్టించిన లాయీస్‌ టెర్మాన్‌ సహా ఏడుగురు మానసిక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ పలువురికి ఐక్యూ పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేసింది. 1919కి దాదాపు 20 లక్షల అమెరికన్లకు ఈ ఐక్యూ పరీక్ష నిర్వహించారు. తర్వాత పలు సంస్థలు, పాఠశాలల్లో ఈ పరీక్షలు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని పరీక్షల్లోనూ ఐక్యూ గణన సాధారణమైపోయింది. ప్రస్తుతం పాఠశాలలు, విద్యార్థులకు సిలబస్‌ తయారీలో ఈ ఐక్యూ పాత్ర కీలకంగా ఉంటోంది.
మానసిక వయసు అనేది ఆ వ్యక్తి ప్రతిభ ఆధారంగా గణిస్తారు. ఓ నాలుగేళ్ల చిన్నారి ఆలోచనా తీరు, ప్రతిభ ఆరేళ్ల చిన్నారికి సమానంగా ఉందనుకుంటే.. ఆ చిన్నారి మానసిక వయసు ఆరేళ్లన్నమాట. ఇలా మానసిక నిపుణులు ఒక వ్యక్తికి ఏ వయసులో ఎంత ప్రతిభ, పరిజ్ఞానం ఉంటుందని ఎప్పుడో గణించారు. దాని ఆధారంగా చిన్నారుల ప్రతిభను వారికన్నా ఇతర వయసుల వారితో పోల్చి ఐక్యూని లెక్కిస్తారు. ఇందుకోసం ఆయా వయసుల వారికి తగినట్లు భాష, నైపుణ్యాలు, విచక్షణ, ఆలోచనా తీరు, సమయస్ఫూర్తి, నేర్పరితనం, జ్ఞాపకశక్తి వంటి పలు అంశాలకు సంబంధించిన ప్రశ్నలు, సమస్యలతో పరీక్ష నిర్వహిస్తారు. ఆరేళ్ల చిన్నారికి ఇచ్చిన సమస్యలను నాలుగేళ్ల చిన్నారి పరీక్షించిందంటే ఆ చిన్నారి ఐక్యూ స్థాయి 6/4X100= 150 అన్నమాట.
ఎవరికి ఎంత ఉంటుంది!
సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఐక్యూ స్థాయి 110-90 ఉండాలి. అంటే ఏ వయసుకు అంత పరిజ్ఞానం ఉండాలన్నమాట. ఒకవేళ 140 కన్నా ఎక్కువగా ఉంటే అతను గొప్ప మేధస్సును కలిగినట్లు లెక్క. 111 నుంచి 139 మధ్య ఉంటే ప్రతిభావంతుడు. 90కన్నా తక్కువగా ఉంటే అతనికి మేధస్సు తక్కువగా ఉన్నట్లే లెక్క. సాధారణంగా ఒత్తిడిలో ఉన్నవారికి ఈ స్థాయి ఉంటుంది. మానసిక సమస్యలున్నవారికి 70 కన్నా తక్కువగా ఉంటుంది.

* గయ్ రైడర్:

డైరెక్టర్ జనరల్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ)
* లి యోంగ్:

డైరెక్టర్ జనరల్, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (యూఎన్ఐడీఓ)
* ఆంథోనీ లేక్ :

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్)
* ముఖిసా కిటుయి:

సెక్రెటరీ జనరల్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ)
* హెలెన్ క్లార్క్:

డైరెక్టర్ జనరల్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ)
* జోస్ ఏంజెల్ గురియా:

సెక్రెటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ)
* ఆంటోనియో గుటెరస్:
యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్
* రాబెర్టో అజెవెడో:
డైరెక్టర్ జనరల్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ)
* నవనీతం పిళ్త్లె:

హై కమిషనర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్
* పీటర్ తోమ్కా:
ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)
* కోసజానా ద్లామినీ జుమా:
ఛైర్‌పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్
* హెర్మన్ వాన్ రోంపుయ్:
ప్రెసిడెంట్, యూరోపియన్ కౌన్సిల్
* థామస్ బాచ్:
ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)
* అలన్ ఐజక్:
ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)
* లామైన్ డయాక్:

ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ (ఐఏఏఎఫ్)
* జోస్ మాన్యువల్ దురావ్ బర్రోసా:
ప్రెసిడెంట్, యూరోపియన్ కమిషన్
* హైలెమరియమ్ దెశాలెన్:
ఛైర్మన్, ఆఫ్రికన్ యూనియన్ అసెంబ్లీ
* హిఫికెపున్యే పొహాంబ:
ప్రెసిడెంట్, సౌత్ - వెస్ట్ ఆఫ్రికన్ పీపుల్స్ ఆర్గనైజేన్ (స్వాపో)
* బబాటుండే ఒసోటిమెహిన్:
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్‌పీఏ)
* గతంలో దీన్ని యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ (యూఎన్ఎఫ్‌పీఏ) అని పిలిచేవారు.
* హర్షకుమార్ భన్వాలా: నా బార్డు ఛైర్మన్
* బాన్ కి మూన్:
సెక్రటరీ జనరల్, ఐక్యరాజ్యసమితి
* జాన్ ఇలియాసన్:
డిప్యూటీ సెక్రటరీ జనరల్, ఐరాస
* క్రిస్టీన్ లగార్డ్ :
మేనేజింగ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)
* ఇరీనా బొకోవా:
డైరెక్టర్ జనరల్, యునెస్కో
* మార్గరెట్ చాన్:
డైరెక్టర్ జనరల్, WHO
* జోస్ గ్రజియానో డ సిల్వా:
డైరెక్టర్ జనరల్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ (FAo)
* తకెహికో నకావో:
ప్రెసిడెంట్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్
* డొనాల్డ్ కబేరుక:
ప్రెసిడెంట్, ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్
* జిమ్ యోంగ్ కిమ్:
ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్
* అహ్మద్ సలీం:
సెక్రటరీ జనరల్, SAARC
* యుకియా అమనో:
డైరెక్టర్ జనరల్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA)
* లీల్యోంగ్ మిన్హ్:
సెక్రటరీ జనరల్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ASEAN)
* సలీల్ షెట్టి:
సెక్రటరీ జనరల్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
* ఆండర్స్ ఫోగ్ రాస్‌మ్యుసేన్:
సెక్రటరీ జనరల్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)
* అబ్దుల్లా సలీమ్ ఎల్-బాద్రి:
సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (OPEC)
* కమలేష్ శర్మ:
సెక్రటరీ జనరల్, కామన్వెల్త్
* అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జాయని:
సెక్రటరీ జనరల్, గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్
* ఎక్మలద్దీన్ ఎహసాంగ్లు:
సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్
* జోస్‌మిగెల్ ఇన్‌సల్జా సలినాస్: 



సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్

'అక్షరాలా' మనది అధమస్థానం!
 
విద్యలో రాష్ట్రానికి 20వ ర్యాంకు
* ఆరోగ్యంలో బీహార్‌ కంటే వెనుకబాటు
* మౌలిక వసతులు కల్పనలో 14వ స్థానం

* 21 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ప్రణాళికా సంఘం
అక్షర క్రమంలో ముందున్నా... అక్షర జ్ఞానంలో మాత్రం మన రాష్ట్రం చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. దేశంలో విద్యాపరంగా జమ్మూకాశ్మీర్‌ చివరి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. ఆరోగ్యంలో మనం 11వ స్థానంలో నిలిచి బీహార్‌ కంటే వెనుకబడిపోయాం. మౌలిక వసతుల కల్పనలోనూ రాష్ట్రం పరిస్థితి అంతంతే. మొత్తానికి అన్ని రంగాల్లోనూ దక్షిణాది రాష్ట్రాల కంటే మన పరిస్థితి అధ్వానంగానే ఉంది.
విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలో జాతీయ సగటు, ఆయా రాష్ట్రాల్లో సాధించిన ఫలితాలను బట్టి ఇప్పటివరకు ర్యాంకులను నిర్ణయిస్తూ వచ్చిన ప్రణాళికా సంఘం... తాజాగా ఓ అధ్యయనం చేయించింది. ఉన్న వనరులను రాష్ట్రాలు ఏ మేరకు వినియోగించుకున్నాయి? తలసరి వినియోగం ఎంత? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని తాజగా ఏ రాష్ట్రం ఎక్కడుందో వెల్లడించింది. ఇదివరకు జరిగిన అధ్యయనాలు నివేదికల ప్రకారం కేరళ అన్ని రంగాల్లో ముందుండగా... బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ బాగా వెనకబడి ఉండేవి. అయితే తాజా అధ్యయనం ప్రకారం పేద రాష్ట్రాలైన ఒడిశా, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌లలో పరిస్థితి బాగా మెరుగుపడింది. ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌ల పరిస్థితి దారుణంగా ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌ పనితీరు ప్రశంసనీయంగా ఉండగా, గుజరాత్‌లో ఆరోగ్య రంగం అధ్వానంగా ఉంది.
మౌలికవసతుల కల్పనలో మహారాష్ట్ర అధ్వానంగా ఉండగా, హర్యానా ఈ రెండింటిలోనూ వెనకబడి ఉంది. తాజా అధ్యయనం రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి దోహదపడుతుందని నివేదిక పేర్కొంది. అనేక అంశాల్లో రాష్ట్రాలను బేరీజు వేయడానికి అవకాశం ఉన్నా, ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ రంగాలకు మాత్రమే పరిమితమైనట్లు నివేదిక పేర్కొంది.
మూడు రంగాలపై విశ్లేషణ...: ఈ మూడు రంగాల్లో 21 రాష్ట్రాలను విశ్లేషించింది. ఆరోగ్య రంగంలో... టీకాలు, మాతా శిశు మరణాలు, పారిశుధ్యం, పౌష్టికాహార లోపం గల పిల్లలు, ఆసుపత్రుల్లో ప్రసవాలను పరిగణనలోకి తీసుకున్నారు. విద్యా రంగానికి సంబంధించి... నమోదైన విద్యార్థులు, వారిలో చదవగలిగే స్థాయి, మహిళల అక్షరాస్యత, ఒకటి నుంచి 8వ తరగతి వరకు బడి మానేసే పిల్లల వివరాలను పరిశీలించారు. మౌలిక రంగాల్లో వ్యవసాయం, విద్యుత్తు, రవాణాను తీసుకున్నారు.
ఇప్పటివరకు ప్రణాళికా సంఘం... రాష్ట్రాల పనితీరును అంచనా వేసే విధానాన్ని పరిగణనలోకి తీసుకొని మూడు విభాగాలుగా (త్రీటైర్‌) విభజించింది. ఇందులో బాగా పనితీరు కనపర్చిన మొదటి విభాగంలో కేరళ, గోవా, హిమాచల్‌, పంజాబ్‌, తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానాలున్నాయి. అయితే ఇప్పుడు మౌలిక వసతుల్లో మహారాష్ట్ర, ఆరోగ్యంలో హర్యానా పనితీరు సరిగాలేదు. రెండో విభాగంలో ఉన్న పశ్చిమబెంగాల్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, జమ్మూ కాశ్మీర్‌, ఒడిశాల పనితీరు మధ్యస్తంగా ఉంది. మూడో విభాగంలో రాజస్థాన్‌, అస్సాం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌లున్నాయి. వీటితో పాటు 2011 జనాభా లెక్కల ఆధారంగా... రాష్ట్రాల వారీగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తలసరి వినియోగం, కొనుగోలుశక్తిని కూడా లెక్కలోకి తీసుకొన్నారు.
రాష్ట్రం
రాజధాని
గవర్నర్
ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి
అరుణాచల్‌ప్రదేశ్ ఇటానగర్ నిర్భయ్ శర్మ నబామ్ టూకి
అసోం డిస్‌పూర్ జె.బి.పట్నాయక్ తరుణ్ గొగోయ్
బీహార్ పాట్నా డి. వై. పాటిల్ నితీష్ కుమార్
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ శేఖర్ దత్ రమణ్ సింగ్
గోవా పనాజి బి.వి. వాంచూ మనోహర్ పారికర్
గుజరాత్ గాంధీనగర్ కమలా బేణిపాల్ నరేంద్ర మోడి
హర్యానా చండీగఢ్ జగన్నాథ్ పహాడియా భూపిందర్ ఎస్. హుడా
హిమాచల్‌ప్రదేశ్ సిమ్లా ఊర్మిళాసింగ్ వీరభద్రసింగ్
జమ్ముకాశ్మీర్ శ్రీనగర్ (వేసవి), జమ్ము (శీతాకాలం) ఎన్.ఎన్. వోహ్రా ఒమర్ అబ్దుల్లా
జార్ఖండ్ రాంచీ సయ్యద్ అహ్మద్ హేమంత్ సోరెన్
కర్ణాటక బెంగళూరు హన్స్‌రాజ్ భరద్వాజ్ కె. సిద్ధరామయ్య
కేరళ తిరువనంతపురం నిఖిల్ కుమార్ ఊమ్మెన్ చాందీ
మధ్యప్రదేశ్ భోపాల్ రామ్‌నరేష్ యాదవ్ శివరాజ్‌సింగ్ చౌహాన్
మహారాష్ట్ర ముంబయి కె. శంకర్ నారాయణన్ పృథ్విరాజ్ చవాన్
మణిపూర్ ఇంఫాల్ అశ్వనీకుమార్(అడిషనల్ ఛార్జ్) -
మేఘాలయ షిల్లాంగ్ కె.కె. పాల్ ముకుల్ ఎ. సంగ్మా
మిజోరం ఐజ్వాల్ వక్కం పురుషోత్తమన్ లాల్ తన్‌హావ్లా
నాగాలాండ్ కోహిమా అశ్విని కుమార్ నిఫ్యూరియో
ఒడిశా భువనేశ్వర్ ఎస్. సి. జమీర్ నవీన్ పట్నాయక్
పంజాబ్ ఛండీగఢ్ శివరాజ్‌పాటిల్ ప్రకాష్ సింగ్ బాదల్
రాజస్థాన్ జైపూర్ మార్గరేట్ ఆల్వా వసుంధర రాజే
(ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది)
సిక్కిం గ్యాంగ్‌టక్ శ్రీనివాస్ పాటిల్ పవన్ చామ్లింగ్
తమిళనాడు చెన్నై కె. రోశయ్య జయలలిత
త్రిపుర అగర్తల దేవానంద్ కొన్వర్ మాణిక్ సర్కార్
ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ అజీజ్ ఖురేషి విజయ్ బహుగుణ
ఉత్తరప్రదేశ్ లక్నో బి.ఎల్. జోషి అఖిలేష్ యాదవ్
పశ్చిమ బెంగాల్ కోల్‌కతా ఎమ్.కె. నారాయణన్ మమతా బెనర్జీ
జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ వివరాలు
నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ (NCT) రాజధాని లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రి
ఢిల్లీ ఢిల్లీ
న‌జీబ్ జంగ్
నూతన సీఎం రావాల్సి ఉంది.
కేంద్రపాలిత ప్రాంతాలు - వివరాలు
కేంద్రపాలితప్రాంతం రాజధాని లెఫ్టినెంట్‌గవర్నర్ ముఖ్యమంత్రి
అండమాన్ నికోబార్ దీవులు పోర్ట్‌బ్లెయిర్ ఎ.కె. సింగ్ -
చండీగఢ్ చండీగఢ్ శివరాజ్‌పాటిల్ -
దాద్రానగర్ హవేలి సిల్వస్సా బి. యస్. భల్లా -
డామన్ డయ్యూ డామన్ బి. యస్. భల్లా -
లక్షద్వీప్ కవరత్తి రాజేష్ ప్రసాద్ -
పుదుచ్చేరి పుదుచ్చేరి వీరేంద్ర కటారియా ఎన్.రంగస్వామి